Education

AP Rice Mappling List Released

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్యపు, వింతతు పింఛన్లను రూ.2,250కి పెంచుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తొలి రోజే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పించన్లను జులై 8 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి రోజున అందజేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘వైఎస్సార్‌ పింఛను కానుక’ పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లను సోమవారం నుంచి పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీకి సంబంధించి ఏర్పాట్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ చేసింది. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పెరిగిన పింఛను పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. మిగతా చోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 రకాల పింఛన్లను ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, కిడ్నీ రోగులు, ఎయిడ్స్‌ బాధితులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. పింఛనును రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్తామన్న సీఎం జగన్‌ హామీ నేపథ్యంలో మొదటి విడతగా రూ.2,250కు పెంచారు. గత ప్రభుత్వం 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్న వారికి నెలకు రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ.3 వేల చొప్పున ఇచ్చేది. తాజాగా ఈ తేడాలేమీ లేకుండా దివ్యాంగులందరికీ రూ.3 వేల చొప్పున అందజేయనున్నారు. దీని వల్ల 3,89,094 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది.

 CLICK HERE:-

https://gramawardsachivalayam.ap.gov.in/pensionReport/RiceCardPages/StateLevelClusterReport.html

 

Click to comment
Exit mobile version